బ్రెజిల్లోని రియో డీ జెనెరియోలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. తల్లి కడుపులోంచి బయటకు వచ్చిన ఓ శిశువు తనకు కనపడిన డాక్టర్లను కోపంగా చూసిన విషయానికి సంబంధించిన ఓ ఫొటో వైరల్ అవుతోంది.ఓ మహిళకు వైద్యులు కాన్పు చేశారు. బిడ్డను బయటకు తీసి, బొడ్డు తాడు కట్ చేస్తోన్న సమయంలో ఆ శిశువు ముఖంలో కనపడిన ఈ హావభావాలకు వైద్యులు కూడా షాక్ అయ్యారు. ఒక నర్సు ఈ ఫొటోను తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది. ఆ శిశువు పుట్టగానే ఏడవలేదు.. దీంతో ఏడిపించడానికి వైద్యులు ప్రయత్నించారు. ‘నన్నెవరూ ఏడిపించలేరు‘ అన్నట్లు ఆ శిశువు కంటి చూపుతో చంపేశాడు. ఆ శిశువు ఆరోగ్యంగానే ఉన్నాడని వైద్యులు తెలిపారు.