మాటమార్చిన సంజయ్‌ రౌత్‌

మాటమార్చిన సంజయ్‌ రౌత్‌

ముంబై: కాంగ్రెస్ పార్టీ కన్నెర్ర చేయడంతో శివసేన నేత సంజయ్ రౌత్ వెనుకంజ వేసారు. ఒకప్పటి ముంబై డాన్ కరీంలాలాను కలిసేందుకు ఇందిరాగాంధీ దక్షిణ ముంబైకి వచ్చేవారని సంజయ్ రౌత్ బుధవారం ఇక్కడ చేసిన వ్యాఖ్య సంచలనాన్ని రేకెత్తిం చింది. మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ, ఎన్సీపీలతో కలసి శివసేన సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన దశలో ఆ వ్యాఖ్యపై కాంగ్రెస్ పార్టీ ఆయన్ను తీవ్రంగా ఆక్షేపించింది. దరిమిలా కరీంలాలాను కలుసుకునేందుకు ఎంతో మంది ప్రముఖులు ముంబైకి వచ్చే వారిని చెబుతూ తన వ్యాఖ్యను సవరించారు. ఫక్తూన్ ఇ హింద్ సంస్థకు పఠాన్ నేత కరీంలాలా తన పలుకు బడితో ఇందిరా గాంధీతో సహా చాలా మంది ముఖ్య నేతలను కలుసుకునేవారని వివరించారు. ఇందిరాగాంధీ ఉక్కు మహిళ.. ఇలా చెప్పేందు కు తాను సందేహించ బోనన్నారు. నెహ్రూ, గాంధీల కుటుంబంపై తనకు ఎంతో గౌరవం ఉందని చెప్పారు. ముంబై చరిత్ర తెలి యని వారు తనపై అనవసర విమర్శలు చేస్తున్నారన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos