ఢిల్లీ : ప్రైవేట్ రంగంలోని విమానయాన సంస్థ ఇండిగో, టికెట్లపై డిస్కౌంట్ ధరలను ప్రకటించింది. మొత్తం పది లక్షల సీట్లను డిస్కౌంట్ ధరతో అందుబాటులోకి తెచ్చింది. దేశీయ విమాన టికెట్ల ధర రూ.999తో ప్రారంభమవుతుంది. విదేశ టికెట్టు ధర రూ.3,499తో ఆరంభమవుతుంది. ఈ ఆఫర్ నేటితో ప్రారంభమై 16న ముగియనుంది. ఈ ఆఫర్ కింద టికెట్లను బుక్ చేసుకున్న వారు మే 29 సెప్టెంబరు 28 మధ్య ఎప్పుడైనా ప్రయాణించవచ్చు. నాన్ స్టాప్ విమానాలకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. కాగా కంపెనీ విమాన టికెట్ల కొనుగోలుపై క్యాష్బ్యాక్ ఆఫర్ను కూడా సంస్థ ప్రకటించింది. డీజీ బ్యాంకు డెబిట్ కార్డుతో టికెట్లను బుక్ చేసుకుంటే రూ.750 వరకు క్యాష్బ్యాక్ పొందవచ్చని తెలిపింది. అయితే కనీసం రూ.4 వేల టికెట్టు ధర ఉన్నవాటికే ఈ ఆఫర్ వర్తిస్తుందని వెల్లడించింది. మొబిక్విక్ ద్వారా బుక్ చేసుకుంటే రూ.వెయ్యి వరకు తగ్గింపు ఉంటుంది.