ఇండోర్ : బంగ్లాదేశ్తో తొలి టెస్టు మ్యాచ్ను కోహ్లీ సేన కేవలం మూడు రోజుల్లోనే ముగించింది. ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మూడో రోజు శనివారం ఆట ఆరంభానికి ముందు ఓవర్నైట్ స్కోరు 493/6 వద్దే టీమిండియా ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. భారీ లోటుతో బ్యాటింగ్కు దిగిన ప్రత్యర్థిని 69.2 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌట్ చేసింది. ముష్ఫికర్ రహీమ్ (64; 150 బంతుల్లో 7×4) ఒక్కడే ఆఖరి వరకు ఒంటరి పోరాటం చేశాడు. మహ్మద్ షమి (4/31), అశ్విన్ (3/42), ఉమేశ్ యాదవ్ (2/51) బంగ్లా పతనాన్ని శాసించారు. ఇషాంత్కు ఒక వికెట్ దక్కింది. ఈ విజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్లో భారత్ ఖాతాలో మరో 60 పాయింట్లు చేరాయి. స్కోరు వివరాలు…
బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్: 150 ఆలౌట్
భారత్ తొలి ఇన్నింగ్స్: 493/6 డిక్లేర్
బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్: 213