న్యాయమడిగితే నిర్బంధించారు

న్యాయమడిగితే నిర్బంధించారు

షాజహాన్ పూర్ : అత్యాచారానికి గురైన న్యాయ శాస్త్ర విద్యార్థినికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఇక్కడ న్యాయ్ యాత్ర చేపట్టిన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల్ని పోలీసులు నిర్బంధించారు. అంతకు ముందు కాంగ్రెస్ నాయకులు జితిన్ ప్రసాద, కౌశల్ మిశ్రా తదితరులను వారి వారి నివాసాల్లోనే నిర్బంధించారు. న్యాయ శాస్త్ర విద్యార్థినిపై భాజపా నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి చిన్మయానంద అత్యాచారానికి పాల్పడిన ఆరోపణ లున్నాయి.నిందితుడు చిన్మయానంద ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడిలీ ఉన్నారు. చిన్మయానందను డబ్బు కోసం న్యాయశాస్త్ర విద్యార్థిని బ్లాక్ మెయి ల్ చేసారనే ఆరోపణపై పోలీసులు అమెను అరెస్టు చేశారు.

తాజా సమాచారం