రైతుల పట్ల కేంద్రం అహంకారం

రైతుల పట్ల కేంద్రం అహంకారం

న్యూ ఢిల్లీ: సంప్రదింపుల పేరుతో రైతుల విషయంలో ప్రభుత్వం అహంకారపూరితంగా వ్యవహరించిందని శుక్రవారం ఇక్కడ జరిగిన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో పార్టీ తాత్కాలిక అధ్యక్షులు సోనియా గాంధీ విమర్శించారు. జాతీయ భద్రత విషయంలోనూ పూర్తిగా రాజీ పడుతోందని వ్యాఖ్యానించారు. అర్నబ్ లీక్స్పై ప్రభుత్వం తమకేం పట్టనట్టుగా వ్యవహరిస్తోందని మండి పడ్డారు. బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నందున పార్లమెంటులో పార్టీ అనుసరించే వ్యూహాలు, సంస్థా గత ఎన్నికల గురించి చర్చించనున్నారు. కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న ఆందోళనలకు మద్దతుగా ఒక తీర్మానాన్ని ఆమోదించనున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos