చైనా సాయానికి డోకా లేదు

చైనా సాయానికి డోకా లేదు

న్యూ ఢిల్లీ : కరోనా నివారణలో భారత్కు అందిస్తున్న సాయం కొనసాగుతుందని భారత్లోని చైనా రాయబారి సన్ వీడాంగ్ మంగళవారం ఇక్కడ తెలిపారు. ‘కరోనాపై పోరులో సహకారం, సంఘీభావం ఎంతో కీలక ఆయుధాలుగా పని చేస్తాయి. చైనాలోని జాక్మా, అలీబాబా ఫౌండేషన్లు భారత్కు ప్రకటించిన విరాళంలో భాగంగా రెండో దఫా వెంటిలేటర్లు, పీపీఈ కిట్లతో పాటు ఇతర వైద్య సామగ్రి ఢిల్లీకి చేరుకుంది. భారత్లోకరోనా తీవ్రత పెరుగుతున్నందున ఇక్కడున్న చైనీయులను చైనాకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. స్వదేశానికి వచ్చేందుకు సుముఖంగా ఉన్న వారు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలి. సంబంధిత మార్గదర్శకాలను వెల్లడించామ’ని తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos