ఇంద్రాణి ముఖర్జియాను ప్రశ్నించిన సీబీఐ

ఇంద్రాణి ముఖర్జియాను ప్రశ్నించిన సీబీఐ

ముంబై : ఐఎన్ఎక్స్ మీడియా అవినీతి కేసులో నేరాన్ని అంగీకరించిన (అప్రూవర్) ఇంద్రాణి ముఖర్జియాను సీబీఐ అధికారులు మంగళ వారం బైకుల్లా జైలులోమరో మారు విచారించారు. ఇదే కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరం అరెస్టు అయ్యారు. కుమార్తె షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జీ బైకుల్లా జైలులో ఖైదీగా ఉన్నారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసుకు సంబంధించి ఐదు దేశాలకు పంపిన లెటర్ ఆఫ్ రెగొటరీస్ల గురించి ఆమెను ప్రశ్నించినట్లు తెలిసింది. ఇంద్రాణి ముఖర్జీ, ఆమె భర్త పీటర్ ముఖర్జియాలు ఐఎన్ఎక్స్ మీడియా గ్రూప్ ప్రమోటర్లు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos