అంతర్యుద్ధంతోనే పాలకుల మార్పు

అంతర్యుద్ధంతోనే పాలకుల మార్పు

లండన్ : కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ లండన్లో శుక్రవారం జరిగిన ఐడియాస్ ఆఫ్ ఇండియా సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ, ఆరెస్సెస్లపై తీవ్రంగా విరుచుకు పడ్డారు. ఇతరులు చెప్పే మాటలను వినే దృక్పథాన్ని మోదీ అలవరచుకోవాలని హితవు పలికారు. భారత దేశాన్ని బీజేపీ, ఆరెస్సెస్ ఓ బంగారు బాతుగా భావిస్తున్నా యని వ్యాఖ్యానించారు. ‘ మాట్లాడే అవకాశం లేని దేశంగా భారత దేశం తయారుకాబోదు. మోదీ వైఖరి మారాలి. నేను వింటాను అనే ధోరణిని అలవరచుకోవాలి. అక్కడి నుంచే అన్నీ వస్తాయి. కానీ మోదీ మంత్రి ఎవరి మాట విన. మాట్లాడే అవకాశం ఇవ్వని దేశం ఉండదన్నారు. స్వేచ్ఛగా మాట్లాడలేని ప్రధాన మంత్రి కార్యాలయం ఉండద న్నారు.ప్రజల మధ్య చర్చలు జరిగి, అభిప్రాయాలు పంచుకుని, తద్వారా నిర్ణయాలు తీసుకునే దేశం భారత దేశమని మనం విశ్వసిస్తామన్నారు. బీజేపీ, ఆరెస్సెస్ మాత్రం భారత దేశమంటే ఓ భౌగోళిక ప్రాంతంగా, ఓ బంగారు బాతుగా భావిస్తున్నాయి. దాని ఫలాలు కర్మ ప్రకారం కేవలం కొద్ది మందికి మాత్రమే అందాలని కోరుకుంటున్నాయి. దళితుడికైనా, బ్రాహ్మణుడికైనా అందరికీ సమానంగా అందాలని మేము విశ్వసిస్తాం’ అని విపులీకరించారు. బహుళ వర్గాల పరస్పర సామరస్య పరిస్థితికి భారత దేశం మళ్ళీ రావాలా? అని అడిగినపుడు రాహుల్ మాట్లాడుతూ, ‘‘మీరు ఉన్న పరిస్థితుల్లో ఆచరణయోగ్యంగా, వాస్తవాలకు అనుగుణంగా ప్రవర్తించాలి. పరిస్థితిని చూడండి. మీ దేశం, దాని అవసరాలు, సౌభాగ్యం, సంభాషణలను పరిగణనలోకి తీసుకోవాలి; ఆ మౌలికాంశాల మార్గదర్శకత్వంలో పని చేయాలి’’ అని చెప్పారు. ‘భారతీ య ప్రజా స్వామ్యం ఈ భూ మండలానికి ప్రధాన తెడ్డు వంటిది. భారత ప్రజాస్వామ్యం ప్రపంచ ప్రజా శ్రేయస్సుకు దోహదపడుతుంది. ఇది ప్రపంచానికి ప్రధాన లంగరు వంటిది .ప్రమా ణాలకు తగినట్లుగా ప్రజాస్వామ్యాన్ని నిర్వహించినది మనం మాత్రమే. దానికి పగుళ్ళు వస్తే, ప్రపంచానికి సమస్య తలెత్తుతుంది. దీన్ని అమెరికా గ్రహిస్తోంది. కానీ నేడు జరుగుతున్నది ఏమిటంటే, అభిప్రాయాలను పంచుకోవడానికి, సంభాషించుకోవడానికి అవకాశం కల్పిస్తున్న వ్యవస్థలపై పద్ధతి ప్రకారం దాడి జరుగుతోంది. భారత రాజ్యాం గం పై దాడి జరుగుతోందన్నారు. ప్రజలను విభజించి, కొందరిని ఓ వైపునకు ఆకర్షించడం, మీడియాపై పూర్తి ఆధిపత్యం చలాయించడం ద్వారా పరివార్ ఒక వ్యవ స్థను నిర్మించింది. అది సామాన్య ప్రజల్లోకి చొచ్చుకెళ్ళింది. బీజేపీని ఎదుర్కొనడానికి కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు మరింత దూకుడుగా ప్రజల వద్దకు వెళ్ళాలి. దాదాపు 60 నుంచి 70 శాతం మంది బీజేపీకి ఓటు వేయరు. వారి వద్దకు ప్రతిపక్షాలు కలిసికట్టుగా వెళ్ళాలన్నా’రు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos