హైదరాబాద్ : తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీఎస్ ఐసెట్-2019 ఫలితాలను శుక్రవారం విడుదల చేశారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ టీ. పాపిరెడ్డితో పాటు ఐసెట్ కేయూ వైస్ ఛాన్సలర్ ఆర్. సాయన్న కాకతీయ యూనివర్శిటీ సమావేశంలో ఫలితాలను వెల్లడించారు. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ www.vidyavision.com లో ఫలితాలు చూసుకోవచ్చు. మే 23, 24 తేదీల్లో ఆన్లైన్ ద్వారా కాకతీయ యూనివర్శిటీ ప్రవేశ పరీక్ష నిర్వహించింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 55 పరీక్ష కేంద్రాల్లో 49 వేల మంది అభ్యర్థులు హాజరయ్యారు. 92 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.