ఆదాలకు వదాన్యత పురస్కారం

ఆదాలకు వదాన్యత పురస్కారం

నెల్లూరు : లోక్సభ సభ్యుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి కి గవర్న్-ఐ డెమోక్రసీ సంస్థ వదాన్య త అవార్డును గురు వారం ఢిల్లీలో ఆ సంస్థ ప్రతినిధులు అందించారు. నిరుడు కరోన కాలంలో సేవ చేసిన 25 మంది పార్లమెంటు సభ్యుల్ని గవర్నర్-ఐ సంస్థ గుర్తించింది. అందులో రెండో స్థానాన్ని ఆదాల రెడ్డి సాధించారు. మొదటి స్థానం అనిల్ ఫిరోజియా కు, మూడో స్థానం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి లభించింది. కరానా సమయంలో నెల్లూరులో చిక్కుబడిన ఇతర రాష్ట్రాల వారిని పంపడం, ఇతర ప్రాంతాల్లో ఉన్న నెల్లూరియులను రప్పించడంలో ఆదాల , అనుయాయులు శ్రమించారు. తన సొంత నిధులు రూ. 20 లక్షలు జిల్లా కలెక్టర్ కు అందించారు. ఏపీఆర్ హెల్పింగ్ హాండ్స్ సంస్థ ద్వారా కరానా రోగుల కోసం ఒక రోబోను, ఖరీదైన 95 మాస్కులు వేలాదిగా వైద్య సిబ్బందికి, పోలీసు శాఖ కు అందించారు. కందుకూరు నియోజకవర్గంలో మూడు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos