పశువైద్యురాలు ప్రియాంకరెడ్డి దారుణ హత్యాచారం ఘటన నేపథ్యంలో వాహనం నిలిచిపోయినా,పెట్రోల్ ఖాళీ అయినా ఇలా ఎటువంటి సమస్య ఎదురైనా వెంటనే తమకు సమాచారం అందిస్తే నిమిషాల వ్యవధిలో అక్కడికి వస్తామంటూ హామీ ఇచ్చిన నగర పోలీసులు మాట నిలుపుకొననారు. ప్రయాణం మధ్యలో పెట్రోలు అయిపోయిందంటూ ఓ యువతి 100కు డయల్ చేస్తే స్పందించిన పోలీసులు పెట్రోలు తెచ్చి పోశారు. రాచకొండ పోలీసులు ట్విట్టర్లో పోస్టు చేసిన ఈ ఫొటో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. వరుస అత్యాచార ఘటనలతో ఉలిక్కిపడిన హైదరాబాద్లో పోలీసులు ఇప్పుడు పూర్తి అప్రమత్తంగా ఉన్నారని చెప్పేందుకు ఇది ప్రత్యక్ష ఉదాహరణ.రాచకొండ పరిధిలో స్కూటీపై ప్రయాణిస్తున్న ఓ యువతి డయల్ 100కు కాల్ చేసి బండిలో పెట్రోలు అయిపోయి ఇబ్బంది పడుతున్న విషయం తెలిపింది. వెంటనే స్పందించిన పోలీసులు పెట్రోలు బాటిల్తో యువతి వద్దకు చేరుకున్నారు. స్కూటీలో వాహనం పోసి జాగ్రత్తలు చెప్పి పంపించారు. రాచకొండ పోలీసులు ఈ ఫొటోను ట్విట్టర్లో పోస్టు చేయడంతో వైరల్ అయింది. యువతి ఫోన్కు స్పందించి సాయం చేసిన పోలీసులను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
A woman sought help of #Police making a call to #Dial_100, #Blue_Colts staff of LB nagar Police Station responded to it swiftly and helped her.@TelanganaDGP @HMOIndia @She_TeamRCK1 @TS_SheTeams @cyberabadpolice @hydcitypolice @IGWomenSafety @DCPEASTZONE pic.twitter.com/hot1RRlRBQ
— Rachakonda Police (@RachakondaCop) November 29, 2019