హైదరాబాద్ : నగర వ్యాప్తంగా మంగళవారం రాత్రి భారీ వర్ష పాతం నమోదైంది. ఏడు నుంచి 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. తిరుమలగిరిలో అత్యధికంగా 12.93, సికింద్రాబాద్లో అత్యల్పంగా 10.60 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వందేళ్ల తర్వాత సెప్టెంబరులో అత్యధిక వర్షపాతం నమోదైందని మంత్రి కేటీఆర్ ట్విటర్లో తెలిపారు. సహాయక చర్యల్లో పాల్గొన్న సిబ్బంది అంకిత భావంతో పని చేస్తున్నారని కొనియాడారు. మేయర్ బొంతు రామ్మోహన్ వర్ష పీడిత ప్రాంతాల్లో పర్యటించారు. బాగా దెబ్బ తిన్న ప్రాంతాలను పరిశీలించారు. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు వంకలను తలపించాయి. వాహనదార్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.