హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ బెంగళూరు-హైదరాబాద్ మార్గంలో గరుడ ప్లస్ ఛార్జీలను రూ.350 వరకు తగ్గించింది. ఇకమీదట బెంగళూరు నుంచి హైదరాబాద్కు శుక్రవారం ఛార్జీ రూ.1,300గా ఉంటుంది. ఆదివారం హైదరాబాద్ నుంచి బెంగళూరు రావడానికి అంతే మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన రోజుల్లో ఇరువైపులా ఛార్జీ రూ.950 చొప్పున నిర్ణయించారు. ఇటీవల ఆర్టీసీ ఛార్జీలు పెరిగినా, కర్ణాటక ఆర్టీసీ, ప్రైవేటు బస్సుల్లో పోల్చితే తక్కువే. డిమాండ్ ఆధారంగా ప్రైవేటు బస్సుల్లో ఛార్జీలు పెంచుతున్నారు.