జాతీయ నిరుద్యోగుల జాబితా తయారీ

జైపూర్:జాతీయ పౌర పట్టికకు పోటీగా కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల జాబితాను రూపొందించనుంది. ‘దేశంలో నానాటికీ నిరుద్యోగ సమస్య పెరిగి పోతోంది.మేము జాతీయ నిరుద్యగిత పట్టికను తయారు చేయను న్నామ’ని కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ ప్రకటించా రు.శుక్ర వారం ఇక్కడ జరిగిన యువజన్ ఆక్రోశ్ ర్యాలీ లో ప్రసంగించారు. నిరుద్యోగులు రాజస్థాన్లో అత్యధికంగా ఉన్నారని, ఇప్పటికే దేశంలో ఐదు లక్షలకు పైగా మంది నిరుద్యోగులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని తెలిపారు. నిరుద్యోగులుగా ఉన్న యువకులు వెంటనే 81519 94411 అనే టోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్ చేసి తమ పేరు నమోదు చేసుకోవాలని కోరారు. సభ జరుగుతున్నంత సేపూ యువకులు ‘మా ఉద్యోగాలు ఎక్కడ? తప్పుడు హామీలొద్దు.ఉద్యోగాలు కావాలి’ అని పెద్ద పెట్టున నినదించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos