హొసూరు వద్ద రూ.42 లక్షల గుట్కా స్వాధీనం

హొసూరు : ఇక్కడికి సమీపంలో ఓ తోటలోని ఇంట్లో అక్రమంగా దాచి ఉంచిన రూ.42 లక్షల విలువ చేసే గుట్కా, పాన్ మసాలా ప్యాకెట్లను పొలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేశారు. బేలగొండపల్లి గ్రామానికి చెందిన వినయ్ రెడ్డికి చెందిన తోటలోని ఇంట్లో భారీ ఎత్తున పాన్ మసాలా,  గుట్కా ప్యాకెట్లు నిల్వ ఉంచారని మత్తిగిరి పోలీసులకు సమాచారం అందింది.

వినయ్ రెడ్డి తోటలోని ఇంట్లోకి వెళ్లి తనిఖీ చేశారు. పోలీసుల తనిఖీల్లో సుమారు రూ.42 లక్షల విలువచేసే గుట్కా ప్యాకెట్లు పట్టుబడ్డాయి. తమిళనాడు ప్రభుత్వం నిషేధించిన గుట్కా, పాన్ మసాలా ప్యాకెట్లు అక్రమంగా నిల్వ ఉంచిన వినయ్ రెడ్డి, అతని స్నేహితుడు దినేష్ ను పోలీసులు అరెస్టు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos