క్రిష్ణగిరి జిల్లా నుంచి రూ.30.65 లక్షల విరాళం

క్రిష్ణగిరి జిల్లా నుంచి రూ.30.65 లక్షల విరాళం

హొసూరు : కరోనా వ్యాధిని నియంత్రించేందుకు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీల నాయకులు సినీ నటులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ప్రైవేట్ కంపెనీల యాజమాన్యాలు భారీగా విరాళాలను ముఖ్యమంత్రి సహాయ నిధి అందజేస్తున్నారు. అందులో భాగంగా తమిళనాడు రాష్ట్రంలోని కృష్ణగిరి జిల్లా ఏడిఎంకె పార్టీ నాయకులు ముఖ్యమంత్రి సహాయనిధికి తమ వంతు విరాళాలు అందజేస్తూ ఉదారతను చాటుకున్నారు. కృష్ణగిరి జిల్లా ఏడిఎంకె పార్టీ తరపున భారీగా విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేశారు. రాజ్యసభ సభ్యుడు,  కృష్ణగిరి జిల్లా ఏడిఎంకె పార్టీ సీనియర్ నాయకుడు కె.పి. మునస్వామి అధ్యక్షతన 30 లక్షల 65 వేల 590 రూపాయల డీడీని  జిల్లా కలెక్టర్ ప్రభాకరన్ ద్వారా ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేశారు. ఈ కార్యక్రమంలో  రాజ్యసభ సభ్యుడు కె పి మునుస్వామితో పాటు మాజీ ఎంపీ అశోక్ కుమార్,  సూలగిరి చైర్ పర్సన్ లావణ్య హేమనాథ్, ఏడిఎంకె పార్టీ నాయకులు చంద్రశేఖర్, సూలగిరి యూనియన్ జిల్లా కౌన్సిలర్ వెంకటా చలపతి తదితరులు ఉన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos