న్యూ డిల్లీ; ఢిల్లీ, గురుగ్రామ్, బెంగళూరులోని చైనా ఎలక్ట్రానిక్, హార్డ్ వేర్ ఉత్పత్తుల తయారీ సంస్థ- హువావే కార్యాలయాలపై ఆదాయపన్ను శాఖ (ఐటీ) అధికారులు బుద వారం సోదాలు చేపట్టింది. ఆదాయపన్ను ఎగవేతలను గుర్తించేందుకే సోదాలు నిర్వహిస్తున్నట్టు అధికారులు తెలిపారు. తమ కార్యకలాపాలు స్థానిక చట్టాలకు లోబడే ఉన్నాయని హువావే స్పష్టం చేసింది. పన్ను అధికారులకు పూర్తిగా సహకరిస్తామని ప్రకటించింది. భద్రతా కారణాల రీత్యా హువావేను 5జీ పరీక్షల్లో పాల్గొనకుండా కేంద్రం దూరం పెట్టడం తెలిసిందే.