హొసూరు ఎమ్మెల్యే సుడి గాలి పర్యటన

హొసూరు ఎమ్మెల్యే సుడి గాలి పర్యటన

హొసూరు : స్థానిక ఎమ్మెల్యే ఎస్ఏ. సత్య పట్టణంలోని 18, 26 వార్డులలో సుడి గాలి పర్యటన చేశారు. తనను గెలిపించిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా 18వ వార్డులో డీఎంకే పార్టీ పతాకాన్ని ఎగురవేసి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆ వార్డుతో పాటు 26వ వార్డు ప్రజలు తమకు మౌలిక వసతులు కల్పించాలని కోరారు. ప్రభుత్వ స్థలాల్లో తాము ఇళ్ళు నిర్మించుకున్నామని, వాటికి పట్టాలు ఇప్పించాలని పేదలు మొరపెట్టుకున్నారు. సంబంధిత అధికారులతో చర్చించి పట్టాలు మంజూరయ్యేలా చూస్తానని ఆయన వారికి హామీ ఇచ్చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos