హొసూరు : స్థానిక ఎమ్మెల్యే ఎస్ఏ. సత్య పట్టణంలోని 18, 26 వార్డులలో సుడి గాలి పర్యటన చేశారు. తనను గెలిపించిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా 18వ వార్డులో డీఎంకే పార్టీ పతాకాన్ని ఎగురవేసి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆ వార్డుతో పాటు 26వ వార్డు ప్రజలు తమకు మౌలిక వసతులు కల్పించాలని కోరారు. ప్రభుత్వ స్థలాల్లో తాము ఇళ్ళు నిర్మించుకున్నామని, వాటికి పట్టాలు ఇప్పించాలని పేదలు మొరపెట్టుకున్నారు. సంబంధిత అధికారులతో చర్చించి పట్టాలు మంజూరయ్యేలా చూస్తానని ఆయన వారికి హామీ ఇచ్చారు.