ఓడిపోయారని గుండు కొట్టించాడు!

ఓడిపోయారని గుండు కొట్టించాడు!

కోల్‌కతా: ఆటలో ఓడిపోయారని దాదాపు జట్టు మొత్తానికే గుండు చేయించాడో కోచ్‌! అండర్‌-19 బంగాల్‌ హాకీ జట్టు ఈ చేదు అనుభవాన్ని ఎదుర్కొంది. జబల్‌పుర్‌లో జరిగిన జాతీయ జూనియర్‌ బి-డివిజన్‌ టోర్నీ క్వార్టర్స్‌లో నాంధారి ఎలెవన్‌ చేతిలో 1-5 గోల్స్‌తో బంగాల్‌ ఓడిపోవడంతో ఆ జట్టు కోచ్‌ ఆనంద్‌ కుమార్‌ ఆగ్రహం తారస్థాయికి చేరింది. జట్టు మొత్తాన్ని చెడామడా తిట్టిన అతను.. గుండు కొట్టించుకోవాల్సిందిగా ఆటగాళ్లను ఆదేశించాడు. దీంతో చేసేదేమీ లేక.. 18 మంది ఆటగాళ్లలో ఇద్దరు మినహా అందరూ కొట్టించుకున్నారు. ఈ సంఘటనను తీవ్రంగా తీసుకున్న   బంగాల్‌ హాకీ సంఘం త్రిసభ్య విచారణ కమిటీని వేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos