ఐదుగురు ఉగ్రవాదుల అరెస్టు

ఐదుగురు ఉగ్రవాదుల అరెస్టు

శ్రీనగర్: జమ్మూకశ్మీర్ లో భద్రతా బలగాలు బుధవారం ఉగ్రవాదుల పెద్ద కుట్రను భగ్నం చేశాయి. ఐదు గురు ఉగ్రవాదుల్ని పట్టుకోవటమే కాకుండా మందుపాతరలకు ఉపయోగించే రసాయనిక పదార్థాల్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. షోపియాన్ జిల్లాలోని ఓ ఇంటిలో ఉగ్రవాదులు దాక్కున్న ఇంటి పై బుధవారం భద్రతా బలగాలు మెరుపు దాడులు చేసాయి. ఈ సందర్భంగా హిజ్బుల్ ముజాహిదీన్ కు చెందిన ఐదుగురు ఉగ్రవాదులను పట్టుకున్నారు. భూమిలో అమర్చడానికి సిద్ధం చేసిన శక్తిమంతమైన ఐఈడీ(అత్యాధునిక పేలుడు పదార్థం)ని స్వాధీనం చేసుకున్నారు. భద్రతా బలగాలు రాకపోకలు సాగించే రోడ్డుపై ఈ ఐఈడీని అమర్చేందుకు ఉగ్ర మూకలు కుట్ర పన్నాయని పదాతి దళం ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos