రెవెన్యూ అధికారులపై హైకోర్టు కొరఢా..

రెవెన్యూ అధికారులపై హైకోర్టు కొరఢా..

మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు పరిహారం చెల్లింపు విషయంలో నిర్లక్ష్యం వహించిన రెవిన్యూ అధికారుల తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.మల్లన్నసాగర్ నిర్వాసితులకు న్యాయం చేయడంలో రెవిన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టుగా హైకోర్టు అభిప్రాయపడ్డ కోర్టు గజ్వేల్ఆర్డీఓ విజయేందర్రెడ్డి, తొగుట తహసీల్దార్ప్రభుకు రెండు నెలల జైలు శిక్ష విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇద్దరికీ జైలు శిక్షతో పాటు రూ.2 వేల జరిమానా, విధుల నుంచి సస్పెండ్చేస్తూ తీర్పు చెప్పిందిమల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని బాధితులు కోర్టును ఆశ్రయించడంతో పరిహారం వెంటనే చెల్లించాలంటూ గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.అయితే ఇద్దరు అధికారులు హైకోర్టు ఆదేశాలను సైతం నిర్లక్ష్యం చేయడంతో మల్లన్నసాగర్ భూ నిర్వాసితులు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు జైలుశిక్ష,జరిమానాతో పాటు సస్పెన్షన్ చేస్తూ హైకోర్టు ఆదేశాలు  జారీ చేసింది...

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos