ఎంపీ పై సీఎం రూ.100 కోట్ల పరువు నష్టం దావా

ఎంపీ పై సీఎం రూ.100 కోట్ల పరువు నష్టం దావా

రాంచీ: ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ భాజపా లోక్సభ సభ్యుడు నిశికాంత్ దూబేకు వ్యతిరేకంగా రూ.100 కోట్ల పరువు నష్టం దావా ఇక్కడి సివిల్ న్యాయస్థానంలో దాఖలు చేసారు. నిశికాంత్ దూదేతో పాటు ట్విట్టర్ కమ్యూనికేషన్సు ఇండియా ప్రైవేటు లిమిటెడ్, ఫేస్ బుక్ ఇండియా ఆన్ లైన్ సర్వీసెస్ ప్రైవేటు లిమిటెడ్ల నూ రెండు, మూడో నిందితులుగా పేర్కొన్నారు. ‘2013లో తను ముంబైలో ఒక మహిళపై అత్యాచారం చేశానని, ఇంకా నా పరువు పోయేలా జులై 27న సామాజిక మాధ్యమాల్లో పలు ఆరోపణలు చేశారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. దావా విచారణ విచారణను ఆగస్టు 22కి వాయిదా పడింది. పరువు నష్టం దావా వేసిన తర్వాతా హేమంత్ సోరెన్పై ట్విట్టర్ లో దూబే ఆరోపణల్ని చేస్తూనే ఉన్నారు. ‘మీ పై ముంబైలో ఒక యువతి రేప్ చేశారంటూ ఫిర్యాదు చేసింది. మీరు ఆమె పై న్యాయ పోరాటం చేయాలి. మీరు నా మీద కాకుండా ఆమె మీద కేసుపెట్టాలి. ఏది ఏమైనా సరయూ రాయ్లాగా ఒక సీఎంతో పోరాడేందుకు నాకు అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు’అని ట్వీట్ చేశారు

తాజా సమాచారం

Latest Posts

Featured Videos