ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్ని గడించాయి. కొనుగోళ్లు ఇందుకు ప్రధాన కారణం. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ 428 పాయింట్లు ఎగబాకి 41,010 వద్ద, నిఫ్టీ 115 పాయింట్ల లాభంతో 12,087 వద్ద స్థిరపడ్డాయి. డాలర్తో రూపాయి మారకం విలువ 70.78గాదాఖలైంది. 250 పాయింట్లకు పైగా లాభంతో వ్యాపారాన్ని ఆరంభించిన సెన్సెక్స్ ఆ తర్వాత వెనుదిరిగి చూసుకో లేదు.