లక్నో : హాథ్రస్ బాధితురాలిపై రోజుకో కథనం పుట్టుకొస్తుండటంపై కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితురాలి విషయంలో వస్తున్న వదంతుల్ని తీవ్రంగా ఖండించారు. ‘స్త్రీకి న్యాయం కావాలి. అంతే తప్ప అపవాదు కాదు. సిగ్గులేని భాజపా’అని ట్విట్టర్ లో ధ్వజ మెత్తారు. ‘స్త్రీల పాత్రను కించపరిచే విధంగా కథనాలను సృష్టిస్తున్నారు. పైగా నేరాలకు ఆమెనే బాధ్యురాలిగా చిత్రీకరించి తిరోగమనం వైపు వెళ్తున్నార’ని మండి పడ్డారు.