భగవద్గీత చదివించిన..ఆయన ఉగ్రవాదా?

భగవద్గీత చదివించిన..ఆయన ఉగ్రవాదా?

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ని భాజపా ఉగ్రవాదిగా అభివర్ణించినందుకు ఆయన కుమార్తె హర్షిత తీవ్రంగా ఆగ్రహించారు. బుధవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘ఇంతకంటే నీచమైన రాజకీయాలు ఏముం టాయి. ఎన్నికల లబ్ధి కోసం అనసవర ఆరోపణలు చేయడం తగదు. ‘ప్రజలకు ఉచిత ఆరోగ్య సదుపా యం కల్పించడం ఉగ్రవాదమా?పిల్లల చదువు కోసం వసతులు కల్పిస్తే ఉగ్రవాదమా? విద్యుత్తు,తాగు నీటి సదుపా యం మెరుగుపరచడం ఉగ్రవాదమా? నా తండ్రి ఎప్పటినుంచో సామాజిక సేవ చేస్తున్నారు.మా చిన్న ప్పుడు నన్ను, మా సోదరుణ్ని, మా అమ్మని, నాన్మమ్మ-తాతయ్యని ఉదయం ఆరు గంటల కల్లా నిద్ర లేపేవారు. భగవద్గీత చదివించేవారు. ఇన్సాన్ సే ఇన్సాన్ కా హో భాయిచారా గీతం పాడించేవారు. ఇది ఉగ్రవా దమా? కేజ్రీవాల్పై విమర్శలు చేస్తున్న వారికి ప్రజలు ఫిబ్రవరి సరైన సమాధానం చెబుతారు.ప్రజలు అభి వృద్ధికి ఓటు వేస్తారో లేదా విమర్శలకు ఓటు వేస్తారో ఈ నెల 11న తేలిపోతుంద’న్నారు. ఇటీవల ఒక ప్రచార సభలో భాజపా లోక్సభ సభ్యుడు పర్వేశ్ వర్మ కేజ్రీవాల్ని ఉగ్రవాదిగా అభివర్ణించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos