చేతులెత్తేసిన మోదీ

చేతులెత్తేసిన మోదీ

న్యూ ఢిల్లీ : ప్రధాని మోదీ కరోనా నివారణ చర్యల్ని తీసుకోవటంలో దారుణంగా విఫలమై ఆ వ్యాధికి లొంగి పోయారని కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ శనివారం చేసిన ట్వీట్లో వ్యాఖ్యానించారు. జూన్ 9 తర్వాత కరోనాపై కేంద్ర మంత్రుల బృందం భేటీ జరగలేదు. జూన్ 11 తర్వాత కేంద్ర ఆరోగ్యశాఖ కరోనా సంక్షోభంపై సమీక్ష చేయలేదని ఒక పత్రికలో వచ్చిన కథనాన్ని కూడా జత చేసారు. ‘కరోనాపై పోరాడకుండా మోదీ చేతులెత్తేసారు. దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. రికార్డుస్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరణాలు కూడా పెరుగుతున్నాయి. లాక్డౌన్ నిబంధనలు సడలించడంతో కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. శనివారం నాటికి దేశంలో కరోనా కేసులు సంఖ్య 5,08,953. 15,685 మంది మృతి చెందారు. 1,97,387 మంది చికిత్స పొందుతున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos