జ్ఞానవాపి మసీదు బావిని సీజ్ చేయండి

జ్ఞానవాపి మసీదు బావిని సీజ్ చేయండి

వారణాసి: జ్ఞానవాపి మసీదు ఆవరణ లో శివలింగం కనిపించిన బావిని స్వాధీనం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కౌశల్ రాజ్ శర్మను కోర్టు సోమవారం ఆదేశించింది. జిల్లా కలెక్టర్, పోలీసు కమిషనర్, సీఆర్పీఎఫ్ వారణాసి విభాగం సంబంధిత ప్రాంత భద్రత బాధ్యత చేపట్టాలని సూచించింది. కోర్టు ఆదేశాలను అనుసరిస్తామని మసీదు నిర్వహణ కమిటీ జాయింట్ సెక్రటరీ యాసిన్ ప్రకటించారు. ‘‘కోర్టు ఆదేశాలను తూచ తప్పకుండా అమలు చేస్తాం. సర్వేకు పూర్తి సహకారం అందిస్తాం. కానీ, పిటిషనర్లతో భాగ స్వామ్యం ఉన్న వ్యక్తులు ప్రకటనలు చేస్తుండడం, సర్వే వివరాలను లీక్ చేస్తుండడం ఎంతో బాధకు గురిచేస్తోంది’’అని పేర్కొన్నారు. కోర్టు ఆదేశించినట్టు సర్వే సోమవారం ఉదయం ముగిసింది. మసీదులో వీడియోగ్రఫీ సర్వేను వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్ ను అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ లోగడ కొట్టివేసింది. దీంతో సర్వే అక్కడ చేసారు. దీన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆధ్వర్యంలోని ధర్మాసనం మంగళవారం విచారణ నిర్వహించనుంది.

తాజా సమాచారం