అమరావతి : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల నియామక పత్రాల్ని అందుకున్న అభ్యర్థులో అందులోని ఆంక్షలతో అవాక్కయ్యారు. ప్రతి ఉద్యోగి మూడేళ్లు తప్పనిసరిగా పని చేయాలి. ఉద్యోగాన్ని అర్థంతరంగా మానేస్తే అప్పటి వరకూ పొందిన గౌరవ వేతనం, ప్రభుత్వం చేసిన శిక్షణ వ్యయాన్ని కూడా తిరిగి చెల్లించాలి. మూడేళ్ల వ్యవధిలో రెండేళ్లు పరీశీలన ( ప్రొబేషనరి) కాలం. ఉద్యోగాలు పొందిన వారిలో ఎక్కువ మంది గ్రూప్ పరీక్షలకు సిద్ధమైన అభ్యర్థులే. గ్రూప్ – 2,3 పరీక్షలు రాసిన వారూ ఫలితాల్లో మంచి మార్కులొస్తే ఆ ఉద్యోగాలకు వెళ్లే అవకాశముంది. కొందరు ఉద్యోగంలో చేరకూడదని తీర్మానించినట్లు తెలిసింది.