భాజపాలోకి మరిందరు

భాజపాలోకి మరిందరు

న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లోని నాయకులు పలువురు తమ పార్టీలో చేరనున్నారని భాజపా రాజ్యసభ సభ్యుడు జీవీఎల్. నరసింహారావు తెలిపారు. శుక్రవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘అనేక రాజకీయ పక్షాల నాయకులు భాజపాలో చేరేందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నారని వివరించారు.‘రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇతర పార్టీల నాయకులు పెద్ద సంఖ్యలో చేరికలు ఉంటాయని గతంలోనే చెప్పా, తాను చెప్పిన ట్లే ఇప్పుడు జరుగుతోంది. భాజపాను విమర్శించిన నాయకులే ఈ రోజు తమ పార్టీలో చేరుతున్నారు. అటే తమ పార్టీకే భవిష్యత్తు ఉందన్న విషయం వారికి అర్థమైంది. తమ పార్టీలోకి వచ్చే వారిని స్వాగతిస్తున్నామని’ విపులీకరించారు. ‘మాకు రాజ్యసభలో సంఖ్యాబలం తక్కువగా ఉంది. ఇతర పార్టీల సభ్యులు మా పార్టీలో చేరడం వల్ల మాకు బలం పెరుగుతుంది. భాజపాలోకి ఫిరాయింపులు ఏస్థాయిలో ఉంటాయో చెప్పలేను. వేచి చూడాల్సిందేన’ అన్నారు. ‘భాజపాలో చేరేందుకు ఇష్టపడ్డ వారే వస్తున్నారు తప్ప, బలవంతపు చేరికలు లేవని’ స్పష్టీకరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos