దక్షిణ పెన్నా నదిలో విద్యార్థి గల్లంతు

  • In Crime
  • October 5, 2019
  • 211 Views
దక్షిణ పెన్నా నదిలో విద్యార్థి గల్లంతు

హోసూరు: దక్షిణ పెన్నానదిలో ఈత కొట్టేందుకు వెళ్లిన ప్రైవేట్ కాలేజి విద్యార్థి గల్లంతయ్యాడు. హోసూరు సమీపంలోని చప్పడి గ్రామానికి చెందిన గురుమూర్తి ఒక ప్రైవేట్ కళాశాల్లో బిటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు.శుక్రవారం కాలేజి సమీపంలోని గోపసంద్రం వద్ద ప్రవహిస్తున్న దక్షిణ పెన్నానదిలో తన స్నేహితులతో కలిసి ఈత కొట్టేందుకు వెళ్ళాడు. గురుమూర్తి నదిలో ఈతకొడుతుండగా అలల ఉధృతి ఎక్కువకావడంతో ప్రవాహంలో కొట్టుకెళ్లాడు. స్నేహితుడు కార్తికేయన్ అతనిని కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేక పోయింది. గురుమూర్తి కోసం అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా గాలిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos