న్యూఢిల్లీ : నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రాజ్యసభలో బుధవారం విపక్ష నేత గులాబ్ నబీ ఆజాద్ డిమాండు చేసారు. బ్రిటీష్ పాలనలో కూడా వ్యవసాయ చట్టాన్ని ఉపసంహరించుకున్న దాఖలాలు ఉన్నాయని తెలిపారు. జనవరి 26 నుండి కనిపించకుండా పోయిన వారి ఆచూకీ కోసం సమితిని నియమించాలని కోరారు. ఆ రోజు ఎర్రకోట వద్ద జరిగిన ఊహించని దాడిని ఖండించారు. నేరగాళ్లను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.