న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పన్ను చెల్లింపుల్లో నూతన సంస్కరణలు తెస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శని వారం లోక్సభలో ప్రవేశ పెట్టిన నూతన బడ్జెట్లో ప్రతిపాదించారు. జీఎస్టీ వల్ల పన్ను చెల్లింపులు సులభతరమయ్యాయన్నారు. ఇన్స్పెక్టర్ రాజ్కు కాలం చెల్లి దాదాపు 10 శాతం పన్ను భారం తగ్గిందని పేర్కొన్నారు.