జీఎస్టీ ఇక ‘గృహ సర్వనాశన ట్యాక్స్​’

న్యూ ఢిల్లీ : ప్రభుత్వం మరిన్ని వస్తువుల పై జీఎస్టీ విధించి నందుకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా మండి పడ్డారు. ఇప్పటి వరకు ‘ప్రధాన మంత్రి గబ్బర్ సింగ్ ట్యాక్స్’గా ఉన్న జీఎస్టీ.. దీనితో ‘గృహస్తీ సర్వ నాశన్ ట్యాక్స్ (ఇళ్లను నాశనం చేసే పన్ను)’గా మారిందని విమర్శించారు. తక్కువ ధర ఉన్న హోటల్ వసతి, ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలపై జీఎస్టీ విధించారు. ప్యాకేజ్డ్ మాంసం, చేపలు, పెరుగు, తేనె, పన్నీర్ లతోపాటు లేబుల్డ్ (బ్రాండ్ల పేరుమీద అమ్మే) ఆహార వస్తువులపైనా పన్ను విధించేందుకు సిద్ధమైంది. “ఇప్పటికే దేశంలో ఉపాధి తగ్గిపోయింది. ఇంకోవైపు ధరలు పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు కుటుంబాలను నాశనం చేసేలా జీఎస్టీ విధిస్తున్నారు..” అని మండిపడ్డారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos