హోసూరులో నిత్యావసర వస్తువుల పంపిణీ

హోసూరులో నిత్యావసర వస్తువుల పంపిణీ

హోసూరు : ఇక్కడి పారిశ్రామికవాడలోని ఓ ప్రైవేట్ కంపెనీ యాజమాన్యం, హోసూరు మైరాడా స్వచ్చంద సంస్థలు సంయుక్తంగా రెండు వందల మంది పేద ప్రజలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశాయి. హోసూరు పారిశ్రామికవాడలోని హెచ్‌యూఎల్ అనే ప్రైవేట్ కంపెనీ, మైరాడా స్వచ్చంద సంస్థలు సంయుక్తంగా హోసూరు యూనియన్ నాగొండపల్లి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాయి. హెచ్‌యూఎల్ ప్రైవేట్ కంపెనీ మేనేజర్ అనిల్ కుమార్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హోసూరు ఆర్డీవో కుమరేశన్ హాజరై, నాగొండపల్లి గ్రామంలోని రెండు వందల మంది పేదలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ నాగొండపల్లి గ్రామంలోని పేదలకే కాకుండా హోసూరు చుట్టు పక్కల సుమారు వెయ్యి కుటుంబాలకు హెచ్‌యూఎల్ కంపెనీ ద్వారా నిత్యావసర వస్తువులను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హోసూరు ఆర్డీవోతో పాటు తహశీల్ధార్ వెంకటేశన్, మైరాడా స్వచ్చంద సంస్థ నిర్వాహకులు, లేబర్మెంట్ కార్యాలయ ఉద్యోగులు, నాగొండపల్లి గ్రామస్థులు పాల్గొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos