శ్రీనగర్: జమ్మూ-కశ్మీర్, సోపోర్లోని పోలీస్ స్టేషన్ పై ఉగ్ర వాదులు శుక్రవారం సాయంత్రం మూడున్నర గంటల ప్రాంతంలో గ్రనేడ్ దాడి చేశారు. ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. సమాచారం తెలిసిన వెంటనే అదనపు బలగాలు హుటా హుటిన అక్కడకు చేరుకున్నాయి. ఉగ్ర వాదుల కోసం జల్లెడ పడుతున్నారు. మరిన్ని వివరాలు అందాల్సి ఉన్నాయి.