పీయుష్‌ గోయల్‌ రహస్య దస్త్రాలు చోరీ

పీయుష్‌ గోయల్‌ రహస్య దస్త్రాలు చోరీ

ముంబై: రైల్వే మంత్రి పీయూష్ గోయల్ నివాసంలో రహస్య దాఖలాలు చోరీ అయ్యాయి. ఇంట్లో పని చేస్తున్న విష్ణుకుమార్ విశ్వకర్మ (28) గత నెల 16 నుంచి 18 మధ్య వెండి, ఇత్తడి వస్తువులు, మంత్రి వ్యక్తిగత కంప్యూటర్లోని అధికారిక రహస్య పత్రాలను చోరీ చేశాడు. రహస్య పత్రాల్ని గుర్తు తెలి యని వ్యక్తులకు అతడు ఈ మెయిల్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మెయిల్ చేసిన తర్వాత తన ఫోన్లో సంబంధిత సమాచారాన్ని విష్ణు కుమార్ తొలగించారని తెలిపారు. మంత్రి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. చోరీ అయిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos