నియమాల్ని పాటించని ఈ-కామర్స్ సంస్థలపై చర్యలు

నియమాల్ని పాటించని ఈ-కామర్స్ సంస్థలపై  చర్యలు

న్యూఢిల్లీ: దేశంలోని మల్టీ బ్రాండ్ రిటైలర్లు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం ఇక్కడ హెచ్చరించారు. ‘ఈ-కామర్స్ సంస్థలకు కేంద్రం స్పష్టంగా మార్గదర్శకాల్ని రూపొందించింది. దీని ప్రకారం మల్టీ బ్రాండ్ రిటైల్ లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల మొత్తం 49 శాతానికి మించకూడదు. దేశంలోని చిన్న వ్యాపారులు జీవనోపాధి కోల్పోకుండా భాజపా వారికి అండగా నిలుస్తుంద’ని వివరించారు. ‘ చిల్లర వ్యాపారాల్ని వస్తువులపై రాయితీలు, మోసపూరిత ధరలు ప్రకటించే హక్కు ఈ-కామర్స్ సంస్థలకు లేదు. సొంతంగా వస్తువుల్ని తయారు చేసి విక్రయించే హక్కూ లేదు. ఇటీవల ప్రకటించిన ధరల గురించి పూర్తి వివరణ ఇవ్వాలని ఈ-కామర్స్ సంస్థలను వాణిజ్య శాఖ ఇప్పటికే ఆదేశించింద’ని వివరించారు. పండుగల సందర్భంగా అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి సంస్థలు భారీ రాయితీలు ఇచ్చి వినియోగదారులను ఆకర్షించాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos