హోసూరు : అప్పు తీర్చమన్నందుకు మైసూరుకు చెందిన గౌతమ్ అనే వ్యక్తి హతమయ్యాడు. బాగలూరు పోలీసులు ఈ కేసును చేధించి నింది తుల్ని అరెస్టు చేసారు. వారి కథనం ప్రకారం…మైసూరులో లాబ్ టెక్నిషియర్ గా పని చేస్తున్న గౌతమ్ తన మిత్రుడు అరుణ్కు రూ. 50 వేలు అప్పిచ్చాడు. ఎంత కాలమైనా వడ్డీ ఇవ్వ లేదు. బకాయి తీర్చలేదు. దీంతో అరుణ్ను గౌతం వడ్డీ డబ్బు కోసం నిల దీసాడు. పర్యవసానంగా ఇద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్దాయి. చివరకు గౌతమ్ అంతానికి స్నేహితులతో కలసి ఆరుణ్ వ్యూహాన్ని పన్నాడు. ఒక రోజు గౌతంకు ఫోన్ చేసి బకాయి సొమ్ము కోసం బెంగళూరుకు రావాలని కోరాడు. దీంతో బెంగళూరుకు వచ్చిన గౌతంను అరుణ్ బాగలూరూ సమీపంలోని ఓ ప్రైవేట్ ఎస్టేట్కు కారులో తీసుకెళ్లాడు. తన నలుగురు స్నేహితులతో కలిసి ఇనుప చువ్వలతో కొట్టి దారుణంగా హత్య చేసి శవాన్ని అక్కడే పడేసి వెళ్లి పోయారు.ఆ శవాన్ని చూసిన స్థానికులు బాగలూరు పోలీసులకు తెలపటంతో వారు శవాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేసారు.