నోరు జారిన కమలనాథుడిపై కన్నెర్ర్ర

నోరు జారిన కమలనాథుడిపై కన్నెర్ర్ర

కోల్కతా: ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసే వారిని కాల్చిపారేయాలని పశ్చిమబెంగాల్ భాజపా అధ్యక్షుడు దిలీప్ ఘోష్ చేసిన వ్యాఖ్యాల్ని కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో తీవ్రంగా ఖండించారు. ఘోష్ వ్యాఖ్యలు బాధ్యతా రహితమైనవిగా మండి పడ్డారు. ఆది వారం నదియా జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన దిలీప్ ఘోష్ నిరసనల పేరుతో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తు న్న వారిని ఉత్తరప్రదేశ్ తరహాలో కాల్చిపారేయాలని అన్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన చే స్తు న్న వారిపై తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించేవారిపై మమతాబెనర్జీ సర్కార్ ఎలాంటి చర్యలు తీ సు కోవటం లేదని తప్పుబట్టారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడానికి అవేమైనా వారి తండ్రుల నుంచి వచ్చినవాని ప్ర శ్నిం చా  రు. ఉత్తర ప్రదేశ్, అసోం, కర్ణాటక ప్రభుత్వాలు కాల్పులు జరిపి మంచిపని చేశాయని, బెంగాల్ ప్రభుత్వం కూడా అ లాం టి చర్యలే తీసుకోవాలని కోరారు. ఇది పెను దుమారాన్ని రేగింది. భాజపా అధ్యక్షుడు ఉపయోగించిన భాష ఏమాత్రం సమర్థనీ యం కాదంటూ కాంగ్రెస్ పార్టీ నేత దినేశ్ గుండు రావు దుయ్యబట్టారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos