గూండాలను తెచ్చి బెంగాల్‌ను పాడుచేస్తున్నారు

గూండాలను తెచ్చి బెంగాల్‌ను పాడుచేస్తున్నారు

కోల్కతా:భాజపా నేతలు ఉత్తరప్రదేశ్ నుంచి గూండాలను తీసుకువస్తున్నారని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. గుడ్కాలు, పాన్పరాగ్లు నములుకుంటూ వచ్చి పశ్చిమ బెంగాల్ సంస్కృతిని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. బుధవారం బిష్నాపూర్ జరిగిన ఎన్నికల ప్రచార బహిరంగ సభలో ప్రసంగించారు. ‘వాళ్లు (బీజేపీ) బయటి నుంచి బెంగాల్కు రౌడీలను తీసుకొస్తున్నారు. మనవాళ్లను నేను బయటి వాళ్లు అనడం లేదు. బయటి వాళ్లంటే వేరే రాష్ట్రాల నుంచి వస్తున్నవారు. కాషాయపు బట్టలు వేసుకొని, గుడ్కాలు, పాన్పరాకులు నమిలే గూండాలను ఉత్తరప్రదేశ్ నుంచి తీసుకు వస్తున్నారు. వాళ్లే మత బెంగాల్ సంస్కృతిని పాడు చేస్తున్నారు’’ అని మండిపడ్డారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos