హొసూరు : హొసూరులో డీఎంకే పార్టీ ప్రముఖుని హత్య కేసులో నిందితులు ఐదు మందిపై కృష్ణగిరి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గూండా కేసులు నమోదు చేశారు. డీఎంకే పార్టీ నాయకుడు మన్సూర్
అలీ ఫిబ్రవరి రెండవ తేదీ రాత్రి స్థానిక కామరాజ కాలనీలోని ఆట మైదానం వద్ద దారుణ హత్యకు గురయ్యాడు. దీనిపై విచారణ చేపట్టిన పట్టణ
పోలీసులు హొసూరుకు చెందిన గజా అనే గజేంద్రతో పాటు ఐదు మందిని అరెస్టు చేసి సేలం జైలుకు తరలించారు. కృష్ణగిరి ఎస్పీ బండి గంగాధర్ నిందితులపై గూండా చట్టం
కింద కేసులు నమోదు చేసేందుకు జిల్లా కలెక్టర్ ప్రభాకరన్ అనుమతి కోరారు. కలెక్టర్ అనుమతి లభించడంతో వారిపై గూండా చట్టం కింద కేసులు
నమోదయ్యాయి. గత ఫిబ్రవరి రెండవ తేదీన జరిగిన హత్య హొసూరు ప్రాంతంలో సంచలనం సృష్టించింది.