బంగారు టాయ్లెట్‌ దోచుకెళ్లారు..

బంగారు టాయ్లెట్‌ దోచుకెళ్లారు..

లండన్‌లో ప్రపంచ వారసత్వ కట్టడంగా పేరుగాంచిన బ్లెన్ హీమ్ ప్యాలెస్‌లో ప్రదర్శనశాలలో ప్రదర్శనకు ఉంచిన 18కేరట్ల బంగారంతో చేసిన మరుగుదొడ్డి(టాయ్లెట్)ని దొంగలు అపహరించుకుపోవడం సంచలనంగా మారింది.భద్రత కట్టుదిట్టంగా ఉన్నప్పటికీ దొంగలు మరుగుదొడ్డిని దొంగిలించడం గమనార్హం.న్యూయార్క్‌లోని సోలోమన్ ఆర్ గుగెన్‌హైమ్‌ ప్రదర్శనశాల నుంచి రెండ్రోజుల క్రితమే ఈ బంగారు మరుగుదొడ్డిని లండన్ తీసుకువచ్చారు. అక్టోబర్ 27 వరకు దీన్ని బ్లనియమ్ ప్రదర్శన శాలలో ఉంచాలని నిర్వాహకులు భావించారు. ఈ క్రమంలోనే దొంగలు పడి ఆ కళాఖండాన్ని దొంగలించుకుపోవడంతో నిర్వాహకులు దిగ్భ్రాంతికి గురయ్యారు. రెండు వాహనాలు దీన్ని దొంగిలించడానికి నిందితులు ఉపయోగించినట్టు పోలీసులు తెలిపారు. ఈ దొంగతనం కేసులో 66ఏళ్ల నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.ఈ బంగారు మరుగుదొడ్డిని గతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు లోన్‌గా ఇచ్చేందుకు సిద్దపడటం గమనార్హం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos