ముంబై: బంగారం, వెండి ధరలు వరుసగా సోమవారం-మూడోరోజూ పెరిగాయి. పది గ్రాముల బంగారం ధర మరో రూ.261లు, కిలో వెండి ధర రూ. 1,103లు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు తగ్గుతున్నా డాలర్తో రూపాయి మారకం విలువ బలహీనపడటంతో దేశీయ మార్కెట్లో వాటి ధరలుపెరుగుతున్నాయి. ఉద్దీపన పథకం పై స్పష్టత లేక పోవడంతో ఔన్స్ బంగారం స్వల్పంగా తగ్గి-1925 డాలర్లకు చేరింది. డాలర్ బలపడినందున ఇతర కరెన్సీల నుంచి పసిడి కొనుగోళ్లు ఖరీదయ్యాయి.