ముంబై: తగ్గు ముఖం పట్టిన బంగారం ధర శుక్రవారం మళ్లీ పెరిగింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.305 పెరిగి రూ. 40,136కు చేరింది.డాలర్ విలువ పతనం, బ్యాంకులు వడ్డీ రేట్ల తగ్గింపు వల్ల మదుర్లు బంగారం వైపు చూస్తు న్నారు. మాల్స్ మూత పడటం, ప్రజలు బయటకు రావడం తగ్గడంతో, బంగారం విక్రయాలు అంతంతమాత్రంగా సాగుతున్నాయని వ్యాపారులన్నారు.