పీఎన్‌బీ కేసులో కొత్తపల్లి గీతకు ఐదేళ్ల జైలుశిక్ష, రూ.లక్ష జరిమానా

పీఎన్‌బీ కేసులో కొత్తపల్లి గీతకు ఐదేళ్ల జైలుశిక్ష, రూ.లక్ష జరిమానా

హైదరాబాదు: పంజాబ్ నేషనల్ బ్యాంకు కు రూ.50 కోట్ల రుణం ఎగవేత కేసులో అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత, ఆమె భర్త రామకోటేశ్వరరావులకు సీబీఐ కోర్టు ఐదేళ్ల జైలుశిక్ష, రూ.లక్ష జరిమానా విధించింది. నిన్న రాత్రి వారిని అదుపులోకి తీసుకున్న అధికారులు బుధవారం అరెస్టు చేశారు. ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేసారు. బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టులో కొత్తపల్లి గీత పిటిషన్ దాఖలు చేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి విశ్వేశ్వర ఇన్ఫ్రా.లిమిటెడ్ సంస్థ పేరుతో రూ.50కోట్ల మేర రుణం కొత్తపల్లి గీత దంపతులు ఎగవేశారు. ఈ విషయాన్ని పీఎన్బీ బ్యాంకు అధికారులు సీబీఐ దృష్టికి తీసుకువెళ్లారు. గీత దంపతులకు శిక్ష, జరిమానా విధింపుతో పాటు బ్యాంకు అధికారులు జయప్రకాశన్, అరవిందాక్షన్కు కూడా సీబీఐ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. విశ్వేశ్వర సంస్థకు రూ.2 లక్షల జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos