ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభ మయ్యాయి. ఉదయం 9.51గంటల వేళకు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్ 81 పాయింట్లు లాభపడి 37,545 వద్ద,జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ నిఫ్టీ 31 పాయింట్ల లాభపడి 11,089 వద్ద ట్రేడ్ అయ్యాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 71.87 వద్ద దాఖలైంది. బ్రిటానియా, టాటా మోటార్స్, యూపీఎల్, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా స్టీల్ షేర్లు లాభాల్ని గడించాయి. హెచ్సీఎల్, ఇన్ఫోసిస్, సిప్లా, టీసీఎస్, టెక్ మహీంద్రా షేర్లు నష్టాలు చవి చూసాయి. ఐటీ మినహా మిగతా రంగాల షేర్లన్నీ లాభాల బాట పట్టాయి.