తిరుమల ఘాట్‌లో తప్పిన ముప్పు

తిరుమల ఘాట్‌లో తప్పిన ముప్పు

తిరుమల : తిరుమల నుంచి కొండపైకి వెళ్లే దారిలో మంగళవారం మధ్యాహ్నం ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ సంఘటనలో పది మంది భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. వినాయక స్వామి ఆలయం దాటిన తర్వాత బస్సు అదుపు తప్పి కారును ఢీ కొట్టి లోయ వైపు దూసుకెళ్లింది. చెట్టు కొమ్మలు, వృక్షాలు అడ్డుగా ఉండడంతో బస్సు రహదారి పిట్ట గోడపై నిలిచిపోయింది. గాయపడిన భక్తులను తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు. చెట్టు కొమ్మలు అడ్డుకోకుంటే పెను ప్రమాదమే జరిగి ఉండేదని భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos