ఉరికి ఒక్కరోజుముందు..సుప్రీంకు నిర్భయ దోషి

ఉరికి ఒక్కరోజుముందు..సుప్రీంకు నిర్భయ దోషి

న్యూ ఢిల్లీ: నిర్భయ హత్యాచారుల ఉరికి ఒక్క రోజే గడువు. మరో వైపు శిక్ష అమలును వాయిదాకోసం దోషుల ప్రయత్నాలూ కొనసాగుతూనే ఉన్నాయి. నిర్భయ ఘటన సమయంలో తాను మైనర్ అని దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కొట్టివేయటాన్ని సవాల్ చేస్తూ దోషుల్లో ఒకడైన పవన్ గుప్తా శుక్రవారం-ఉరికి ఒక్కరోజు ముందు అత్యున్నత న్యాయస్థానంలో సమీక్ష వ్యాజ్యా న్ని దాఖలు చేసారు. అందులో ఉరి తీతను నిలుపుదల చేయాలని కోరారు. నిర్భయ హత్యచార ఘటన సమయంలో తాను మైనర్ అని, దాని ఆధారంగానే విచారణ జరపాలని కోరుతూ పవన్ గుప్తా ఇటీవల దాఖలు చేసిన వ్యాజ్యాన్ని అత్యు న్నత న్యాయ స్థానం తిరస్కరించింది. ఢిల్లీ కోర్టు విధించిన ఉరి శిక్ష ప్రకారం శనివారం ఉదయం ఆరు గంటలకు దోషులను ఉరి తీయాలి.

తాజా సమాచారం