విష వాయువుకు ఎనిమిది మంది బలి

విష వాయువుకు ఎనిమిది మంది బలి

విశాఖపట్టణం: ఇక్కడి ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో గురువారం రసాయనిక వాయువు వెలువడిన ఘటనలో మృతులు ఎనిమిదికి పెరిగారు. ఆర్ఆర్ వెంకటాపురంలో ముగ్గురు, విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతూ మరో ఐదుగురు మృతి చెందారు. బాధితులతో ఆసుపత్రి కిక్కిరిసిపోయింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక విమానంలో 11:45 గంటలకు విశాఖ చేరుకుని బాధితులను పరామర్శించనున్నారు. విష వాయువు వెలువడిన ప్రాంతం నుంచి దాదాపు ఐదు కిలోమీటర్ల పరిధిలోని ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos